గత కొన్ని రోజులుగా తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రగడ కొనసాగుతుంది. తాజాగా తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది. ఖరీఫ్లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు తీసుకునే దానితో కలిపి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది కేంద్రం. గత కొన్ని రోజులుగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇదే పంచాయితీని తేల్చుకునేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లింది.
ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోసం ప్రయత్నించింది. అయితే ఖరీఫ్ సీజన్లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే అధికంగా సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఆ మాటలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు తెలంగాణ మంత్రులు.. ఖరీఫ్కు సంబంధించి తెలంగాణలో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణ పౌర సరఫరాల కమిషనర్కు లేఖ రాసింది మోడీ సర్కార్. తెలంగాణలో ఖరీఫ్ సీజన్లో బియ్యం సేకరణ లక్ష్యం పెంచినట్టు వెల్లడించింది.
ఇది చదవండి:బాలక్రిష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసులు మోహరింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 20.9.2021న రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. బియ్యం సేకరణ టార్గెట్ పెంచేందుకు ఆమోదం తెలిపినట్టు లేఖలో పేర్కొంది కేంద్ర సర్కార్. మొత్తంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులు సేకరించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహారశాఖ సమాచారం ఇచ్చింది. అంటే.. 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోనుందని కేంద్రం వెల్లడించింది. కేంద్రం నుంచి క్లారిటీ రావడంతో 68.65 లక్షల టన్నుల వరిధన్యాన్ని సేకరించనుంది కేసీఆర్ సర్కార్.