కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అగ్ర నాయకుడు రాహుల్ గాంధీలను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వివిధ మార్గాల్లో రాజ్భవన్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు ఓ ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను సైతం బద్దలుకొట్టారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, రేణుకా చౌదరితో పాటు పలువుర్ని రాజ్భవన్కు వెళ్లకుండా పోలీసులు మార్గం మధ్యలోనే అడ్డుకోవటానికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రేణుకా చౌదరి ఓ పోలీస్ చొక్కా పట్టుకున్నారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.