నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పితృవియోగం జరిగింది. ఎమ్మెల్యే లింగయ్య తండ్రి నర్సింహా గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు… ఆయన వయసు 75 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం నరసింహ ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేశారు వైద్యులు. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఫోన్ ద్వారా పరామర్శించారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి మరణంతో తీవ్ర దుఖఃంలో మునిగిపోవడంతో ఆయనను ఓదార్చి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం. ఇక నర్సింహ అంత్యక్రియలు నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో నిర్వహించనున్నారు. చిరుమర్తి నర్సింహ మృతిపట్ల తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.