ఇంటర్, ఎంసెట్ రాసే విద్యార్థులకు శుభవార్త. సబ్జెక్ట్ లో తక్కువ స్కోర్ వచ్చి, ఎంసెట్ లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్ధులకు శాపంగా మారిన వెయిటేజ్ ను ఈ ఏడాది కూడా లెక్కించనున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎంసెట్ రాసే విద్యార్ధులకు అలర్ట్. ఎంసెట్ ర్యాంకింగ్లో కొంత మంది శాపంగా, మరికొంత మందికి వరంగా మారిన వెయిటేజ్ పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే జీవోలో వెల్లడికానున్నాయి. ఇంతకూ వివరాలు ఏంటంటే.. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని విద్యాశాఖ శాశ్వతంగా తొలగించనుంది. ఈ వెయిటేజీ వల్ల ర్యాంకులు తారుమారు అయిపోతుంటాయి. ఎంసెట్లో మంచిగా స్కోర్ చేసి.. ఇంటర్లో తక్కువ స్కోర్ చేసిన విద్యార్థికి ఈ నిర్ణయం ఉపశమనం కానుంది. దీనిపై సంబంధించిన జీవో త్వరలోనే వెలువడనుంది. 2023-24 విద్యాసంవత్సరానికి ఎంసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రకటించింది.
ఐతే ఈ వెయిటేజీని పూర్తిగా తొలగించే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. ఇప్పటివరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్లోని భాషేతర ( తెలుగు, సంస్కృతం, ఇతర భాషలు, ఇంగ్లీషు మినహాయించి మిగిలిన సబ్జెక్టులు) సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ప్రకటిస్తున్నారు. ఎంసెట్ పరీక్షలో సబ్జెక్టులైన గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఎంసెట్లో 160కి 80 మార్కులు వస్తే 75 శాతం లెక్కన 37.5 మార్కులు వచ్చినట్లుగా పరిగణిస్తారు. (80/160 × 75 = 37.5), ఇంటర్లో 1000 మార్కులకు 850 సాధిస్తే 25 శాతానికి కుదించినప్పుడు 21 మార్కులు వచ్చినట్లు లెక్క. (850/1000 × 25 = 21).గత కొన్నేళ్లుగా మార్కులు కాకుండా పర్సంటైల్ను లెక్కిస్తున్నారు.
పర్సంటైల్ కూడా ఒకటే వస్తే పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకొని ఎవరు పెద్దవారైతే వారికి మెరుగైన ర్యాంకును కేటాయిస్తారు. కరోనా కారణంగా 2020, 2021, 2022 ఎంసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించారు. ఈ ఏడాదితో కూడా కలిపి వరుసగా నాలుగేళ్లుగా ఇంటర్ వెయిటేజీ లేకుండానే ఎంసెట్ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తదుపరి విద్యాసంవత్సరం నుండి శాశ్వతంగా ఎంసెట్ వెయిటేజీని రద్దు చేయాలని భావిస్తున్నారు. దీని వల్ల కొంత మంది విద్యార్థులకు శాపంగా, మరికొంత మందికి వరంగా మారనుంది. సబ్జెక్ట్ పరిజ్ఞానం లేనివారిని ఫిల్టర్ చేయాలనే ఉద్దేశ్యంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బట్టీపట్టి చదువులతో 900లకు పైగా స్కోర్ చేస్తున్న విద్యార్థులు. ఎంసెట్లో కనీస మార్కులు రావడం లేదు. జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలకు ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎప్పుడో తొలగించారు.