ఏపీలో కరోనా విస్తృతిని అడ్డుకట్ట వేయడానికి సర్కార్ సంపూర్ణ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతిస్తున్న కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల మాదిరి కరోనా కట్టడికి సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే 12 గంటల వరకు సమయం ఇవ్వడంతో జనం ఒక్క సారిగా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయని కొందరు చెబుతున్నారు. ఇలాంటి టైంలో లాక్డౌనే బెస్ట్ అని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్ వణికిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 18 గంటలపాటు అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నారు. అత్యవసర మెడికల్కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
వారం నుంచి ఈ నిబంధనలు అమలు అవుతున్నా కరోనా మాత్రం అదుపులోకి రాలేదు – సరికదా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కర్ఫ్యూ వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. మధ్యాహ్నాం 12 గంటల వరకు సమయం ఇవ్వడంతో జనం అవసరం లేకున్నా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతోనే కరోనా కట్టడి కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కర్ఫ్యూ కన్నా లాక్డౌనే ఉత్తమమని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్కు కూడా అధికారులు ఇదే విషయం చెప్పినట్టు సమాచారం.. సంపూర్ణ లాక్డౌన్ లేకుంటే కేసులు అదుపులోకి రావడం కష్టమని భావిస్తున్నారు. కరోనా రెండో దశ వ్యాప్తి ఏపీలో భయానకంగా మారుతుంది. పెరుగుతున్న కేసులు, ఔషధాల కొరత ఇవన్నీ ఒకటైతే మరోపక్క వ్యాక్సిన్ల లేమి, ఆసుపత్రులలో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక పోతున్న ప్రాణాలు, ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహమ్మారి కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీ ప్రభుత్వం ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటుంది. కానీ, ఇప్పటికే మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టేసింది. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షలలో పాజిటివిటీ రేటు పదిశాతం దాటితే ప్రమాదకరంగా భావించాలి. కానీ, ఏపీలో ఇప్పటికే ఈ రేటు ఇరవై శాతానికి మించింది. పది శాతం దాటితేనే లాక్డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. కానీ ఏపీలో మాత్రం పాజిటివ్ రేట్ 20 శాతం దాటుతోంది. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించాలని భావిస్తోంది.