విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆ కుటుంబాలకు కారుణ్య నియామకాల పేరిట గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియమాలకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు విధి నిర్వహణలో మరణించిన సచివాలయ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా కారుణ్య నియామకాలకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అక్టోబర్ 27న ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా ఈ కారుణ్య నియామకాలను చేపడతామని అజయ్ జైన్ అన్నారు. ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అనుమతించడం పట్ల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. వారికి సచివాలయాల్లో ఉద్యోగాలు..https://t.co/AiF54cWLJY#WardSecretariat #AndhraPradesh #APCMYSJagan
— Sakshi (@sakshinews) October 28, 2022