ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ఏపీ ఎన్జీవో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక హామీలను ప్రకటించారు. ప్రత్యేకంగా దసరా కానుకను ప్రకటించారు. హెల్త్ సెక్టర్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు 5రోజులు సీఎల్స్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
2019 నుండి ఇప్పటివరకు 3.19 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించామని.. హెల్త్ సెక్టార్లో 53 వేల మందిని నియమించామని సీఎం జగన్ పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏలో ఒకదాన్ని దసరా పండుగ కానుకగా అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో ఎల్లప్పుడు సానుకూలంగానే స్పందించామని తెలిపారు. ఉద్యోగ వ్యవస్థను మెరుగుపరిచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం జగన్ చెప్పారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చామని, జీపీఎస్ పెన్షన్ పథకానికి రెండు, మూడు రోజుల్లో ఆర్డినెన్స్ వస్తుందని ఆయన తెలిపారు.
కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలతో ప్రభుత్వ యంత్రాంగం విస్తరించిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. నూతన జిల్లాల్లో ఏడు నియోజకవర్గాలకు ఒక కలెక్టర్, ఒక ఎస్పీని నియమించడం జరిగిందని, టీడీపీ ప్రభుత్వం పరిష్కరించలేని సమస్యలను తాము పరిష్కరించామని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ఇచ్చిన ఘనత తమదేనని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిచోట దళారీ వ్యవస్థ లేకుండా చేశామన్నారు. ప్రతి నెల మొదటి వారంలోనే సాలరీలు ఇస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలిచామన్నారు. కారుణ్య నియామకాల్లోనూ పారదర్శకత పాటించామన్నారు. ఇంతవరకు 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశామని వివరించారు.