వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి మాత్రమే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే వారు కానీ ఇక నుండి ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికీ సైతం కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది.. వాహనంపై పడిన చలాన్లను కూడా సక్రమంగా చెల్లించడం లేదని.. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు కొత్త నిర్ణయం తీసుకున్నారు.
నగరంలో 70 శాతానికి పైగా మంది సక్రమంగా చలాన్లను చెల్లించడం లేదు. మళ్లీ మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం 10 చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులను గుర్తించి పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు 10చలాన్ల కంటే ఎక్కువ ఉంటే వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ కౌన్సిలింగ్ లో ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. వాటి వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి అన్న విషయంపై పోలీసులు వాహన దారులకు వివరిస్తారు. ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పిస్తున్నారు.. చివరికి కౌన్సెలింగ్కు హాజరైనట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చి సంబంధిత ట్రాఫిక్ ఠాణాలో అప్పగించాలని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. ఒకసారి చలాన్ కట్టినా మళ్లీ పది సార్లు అలాంటి తప్పులే చేస్తున్నారు. అందుకే ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అంటున్నారు.