భారత దేశంలో ఉంటూ కొంత మంది కొన్ని సందర్భాల్లో జాత్యహంకార దోరణితో ప్రవర్తిస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటన హైదారాబాద్ లో ఒకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ కి వచ్చిన మణిపూర్ జంట తమను ఆపి అవమానించారని ట్విట్టర్ వేధికగా ఆవేదన వ్యక్తం చేశారు.
హైదారాబాద్ లో ని ఐకియా స్టోర్స్ లో వస్తువులు కొనుగోలు చేసి తిరిగి వెళ్తున్న సమయంలో తమను ఆపివేశారని జాత్యహంకార దోరణితో వ్యవహరించారని ఆ దంపతులు ఆరోపించారు. అందరు కస్టమర్లను పంపించినప్పటికీ తమను మాత్రం ఆపివేయడం ఎంత వరకు న్యాయం అంటూ ట్విట్టర్ వేధికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఐకియా సిబ్బందిపై ట్విటర్ వేధికగా ఫైర్ అయ్యారు.
తమ స్టోర్ కి వచ్చిన కస్టమర్లతో ఎలా ఉండాలనో వారితో ఎలా ప్రవర్తించాలి అన్న విషయంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని.. ఐకియా స్టోర్స్ వారు తమ పద్దతి మార్చుకుంటే చాలా మంచిదని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is appalling and absolutely unacceptable @IKEAIndia
Please ensure a proper apology is issued & more importantly educate, sensitise & train your staff to respect all your customers graciously
Hope you will make amends asap https://t.co/l84GimoIrM
— KTR (@KTRTRS) August 29, 2022