ఎంతటి సెలబ్రిటీ అయిన విరామ సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ మామూలే. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అదే పనిలో ఉన్నాడు. కుమారుడు అర్జున్తో కలిసి గోవా బీచ్ కి వెళ్లిన సచిన్ ఆ వాతావరణాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆ బీచ్లోని మత్య్సకారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. చేపలు పట్టే విధానంపై మెళుకువలు అడిగి తెలుసుకున్నారు. అలాగే.. సముద్రం నుంచి మత్స్యకారుల బోటును ఒడ్డుకు లాగేందుకు వారికి సాయం చేశారు. అనంతరం బీచ్ ఒడ్డున ఉన్న ఓ రెస్టారెంట్లో చేపలను ఫ్రై చేపించుకొని కుమారుడితో కలిసి తింటూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సచిన్ సింప్లిసిటీని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.