ఐపీఎల్ పదహారో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో అతడికి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే ఛాన్స్ దక్కింది. కానీ అతడు ఆ మ్యాచ్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గైక్వాడ్ ప్లేసులో ఒక యంగ్ బ్యాటర్కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారని సమాచారం.
ఐపీఎల్-2023 క్లైమాక్స్కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్స్తో పదహారో సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. మునుపటి సీజన్ల కంటే కూడా ఈ ఎడిషన్ కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఒకవైపు ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్లు, యంగ్ ప్లేయర్ల అద్భుతమైన ప్రదర్శనలు.. మరోవైపు ఒకదాన్ని మించి ఒకటిగా ముసురుకున్న వివాదాలు. ఇలా ఐపీఎల్-2023 ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ను ఇచ్చింది. ఈ సీజన్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లలో యశస్వీ జైస్వాల్ ఒకడు. ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ మెరుపు ఇన్నింగ్స్లతో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్ను ఇంప్రెస్ చేశాడు. అలాంటి జైస్వాల్ ఒక గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడని తెలుస్తోంది. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆడే భారత జట్టులో అతడికి చోటు దక్కినట్లు సమాచారం.
డబ్ల్యూటీసీ ఫైనల్కు సెలెక్ట్ అయిన టీమిండియాలో స్టాండ్ బైగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ప్లేసులో యశస్వీ జైస్వాల్ను భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రుతురాజ్ పెళ్లి చేసుకోబోతున్నందున అతడు టీమ్కు అందుబాటులో ఉండట్లేదట. తాను లండన్కు రాలేనని బీసీసీఐకి గైక్వాడ్ చెప్పాడట. జూన్ 5వ తేదీ తర్వాతే టీమ్తో చేరే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించాడట. అయితే భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం రుతురాజ్కు రీప్లేస్మెంట్ చూడాలని సెలక్టర్లను కోరాడట. దీంతో అతడి ప్లేసులో జైస్వాల్ లండన్కు పయనం కానున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమ్లో రుతురాజ్తో పాటు సూర్యకుమార్ యాదవ్, ముఖేష్ కుమార్ను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
Yashasvi Jaiswal set to replace Ruturaj Gaikwad in the Standby lists for India in the WTC Final.
Gaikwad will be getting married. (Reported by Indian Express). pic.twitter.com/dIf1n0aEAi
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2023