క్లౌడ్ బరస్ట్.. సీఎం కేసీఆర్ నోటి నుంచి వెలువడిన ఈ పదం.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వెనక విదేశాల కుట్ర ఉందని.. క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీ సాయంతో.. విదేశాలు.. భారత్పై కుట్ర చేస్తున్నాయని.. గతంలో లేహ్, మొన్న ఉత్తరాఖండ్లో అకస్మాత్తుగా సంభవించిన భారీ వర్షాలు, వరదలకు క్లౌడ్ బరస్టే కారణమని.. గోదావరి ప్రాంతంలో కూడా ఇలాంటి కుట్ర జరుగుతోందని.. ఇది విదేశాల కుట్ర అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వరదలు, వర్షాల వెనక విదేశాల కుట్ర ఏంటి.. అసలు ఇది సాధ్యమేనా అని జనాలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా నెటిజనులు.. అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి అని సర్చ్ చేస్తున్నారు. ఆ వివరాలు..
క్లౌడ్ బరస్ట్ అంటే తెలుగులో మేఘాల విస్ఫోటనం. వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఒక చిన్న ప్రదేశంలో ఒక గంటలో 10 సెంటిమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు మేఘాల విస్ఫోటనం సంభవించే అవకాశం ఉంటుంది. 2013లో ఉత్తరాఖండ్లో అలానే జరిగింది. అపార ఆస్తినష్టం.. భారీగా ప్రాణానష్టం జరిగింది. అయితే కుంభవృష్టిగా గంటలో 10 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిన ప్రతిసారీ అది క్లౌడ్ బరస్ట్ అయి ఉండదని అధికారులు చెబుతున్నారు. అది అక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Heavy Rains: భారీ వర్షాల వెనక విదేశాల కుట్ర కోణం: CM కేసీఆర్
ఎందుకు ఏర్పడుతుంది..
సాధారణంగా రుతుపవనాలు దక్షిణ ప్రాంతంలోని అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. అటు పశ్చిమ మధ్యధరా తీరం నుంచి వీచే గాలులు ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తీసుకుని వస్తాయి. ఈ రెండూ ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవే క్లౌడ్ బరస్ట్కు కారణమవుతాయి. పర్వతాలపై ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి ఉండటం వలన కుంభవృష్టి కురిపిస్తాయి. అందుకే పర్వతాలపై మేఘాల విస్ఫోటనం ఘటనలు ఎక్కువగా నమోదవుతుంటాయి.
మన దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో మే నుంచి జూలై ఆగస్ట్ వరకు క్లౌడ్ బరస్ట్ వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. నదులు, సరస్సులు ఉన్న ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగితే అపార నష్టం జరగనుంది. మన దేశంలో కొండ ప్రాంతాలు ఎక్కువన్న ఉత్తరాఖండ్, జమ్మూూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లోనే ఇలాంటి ఘటనలుు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరుగుతూ ఉంటుంది.
ముందే అంచనా వేయలేం..
మన దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజి లాంటి ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఎక్కువగా సంభవిస్తుంటాయి. బెంగాల్ తీరం నుంచి వీచే అధిక తేమతో కూడిన గాలులతో ఆ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవిస్తుంటుంది. అయితే అక్కడి ప్రజలు ఈ పరిస్థితులకు అలవాటుపడిపోవడం వలన నష్టం ఎక్కువగా జరగదు. చిరపుంజిలో వరద నీరు ఒకే దగ్గర ఉండదు, లోతట్టు ప్రాంతానికి ప్రవహిస్తూనే ఉంటుంది. వరద వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో జనాలు ఉండరు. అందుకే అక్కడ క్లౌడ్ బరస్ట్ అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగవు.
ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో తేమతో కూడిన భారీ మేఘాలు ఢీకొనడం వలన క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అందుకే వీటిని అంచనా వేయడం చాలా కష్టం. రాడార్ సహాయంతో ఎక్కడెక్కక భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయగలుగుతుంది. కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చన్నది మాత్రం చెప్పలేకపోతుంది. దీన్ని అంచనా వేయడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. అలానే మేఘాలపై అయోడైడ్ చల్లడం ద్వారా సులభంగా వర్షం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Murali Mohan: మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు.. ‘పవన్ కళ్యాణ్ సీఎం కావడం పక్కా!’