సరిహద్దు వివాదాలో.. రాజకీయ కారణాలో.. కారణం ఏదైనా గానీ భారతదేశం అంటే పాకిస్తాన్ కి పెద్ద శత్రువు. ఇదీ సగటు పాకిస్తాన్ ప్రజల్లో నాటుకుపోయిన బీజం. ఇది అందరిలోనూ ఇలా ఉంటుందా అంటే చెప్పలేం. కొంతమంది పాకిస్తానీయులు.. భారతదేశం పట్ల, భారతీయుల పట్ల సహృదయభావంతో ఉంటారు. అయితే ఆ సహృదయ భావాన్ని చూసే భాగ్యం ఉంటుందా? అంటే ఖచ్చితంగా ఉంటుందని ఈ సంఘటనే నిరూపిస్తుంది. సినిమాల్లో సన్నివేశం కాదండోయ్.. నిజంగా జరిగిన సంఘటన ఇది. పాకిస్తాన్ ను సందర్శించిన ఒక భారతీయ కుటుంబానికి వారిచ్చిన అతిథి మర్యాదలు చూస్తే.. శభాష్ అని మెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
వీడియోలో తెలిపిన వివరాలను బట్టి, హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి తమ కూతురి టెన్నిస్ మ్యాచ్ కోసం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు వెళ్ళాడు. ఆ తరువాత అక్కడున్న తాహిర్ ఖాన్ అనే ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. సదురు వ్యక్తి వీరు భారతీయులని తెలుసుకొని.. తనతో పాటు తన కార్యాలయానికి వచ్చి భోజనం చేయాల్సిందిగా పట్టుబడతాడు. ఆ వ్యక్తి కోరిక మేరకు అక్కడికి వెళ్లిన భారతీయ కుటుంబానికి.. తాహిర్ ఖాన్ కుటుంబం హైదరాబాదీ బిర్యానీతో పసందైన విందు ఇస్తుంది. అక్కడ వీరు విరాట్ కోహ్లీ గురుంచి కూడా చర్చించుకోవడం గమనార్హం.
“మాకు విరాట్ కోహ్లీని ఇవ్వండి, మీరు ట్రోఫీని తీసుకోవచ్చు” అని సరదాగా చమత్కరిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచులో పాకిస్తాన్ పై కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ సంధర్బంగా వీరు దాని గురుంచి మాట్లాడకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడమే కాదు.. పాకిస్థానీయులకు భారీతీయుల పట్ల ఉన్న సహృదయభావాన్ని కూడా తెలియజేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాకిస్థానీయుల మంచి మనుసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
I want my Indian friends & followers to watch this video. An Indian family who’re visiting Pakistan for his daughter’s tennis match in Islamabad. They met a good friend of mine Tahir Khan & asked for a lift. They’ve shared their experience in the video. This is Pakistan in real✌️ pic.twitter.com/S7VBrQawss
— Ihtisham Ul Haq (@iihtishamm) November 8, 2022