తెల్లవారుజామున చైనాలో భారీ భూకంపం సంభవించింది. వాయువ్య చైనాలోని కింగ్ హై ప్రావిన్సుల్లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9 గా నమోదయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే అమెరికన్ జియోలాజికల్ ఏజెన్సీ భూకంప తీవ్రత 6.6గా పేర్కొంది. జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం..స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. అయితే ప్రాణ నష్టం పెద్దగా లేనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేసింది.
ప్రావిన్సుల రాజధాని జినింగ్ నగరానికి ఉత్తర-వాయువ్యంగా 140 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్టు తెలిపింది. రికర్ట్ స్కేల్2 పై 6.6 తీవ్రతో భూకంపం తొలుత సంభవించిందని, 25 నిమిషాల తర్వాత 5.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు పేర్కొంది. దీని వల్ల ప్రాణనష్టం స్వల్పంగానే ఉన్నప్పటకి, ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. రాజధాని తైపీలో కార్యాలయ భవనాలు కంపించడంతో పాటు, పలుచోట్ల భవనాలు నేలకూలాయి. లైట్లు ఊగుతూ అద్దాలు, చిత్రాలు నేలపై పడ్డ వీడియోలు వైరల్ గా మారాయి.
‘ఈ ప్రాంతంలో కొన్నిచోట్ల ప్రమాదాన్ని నిరోధించే నిర్మాణాలు ఉన్నప్పటికీ, ఎప్పటికైనా ఇక్కడున్న జనాభాకు భూకంపాల వల్ల ముప్పు పొంచి ఉందటూ యూఎస్ జియోలాజికల్ సర్వే వ్యాఖ్యానించింది. 2010లో కింగ్ హైలో 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 3,000 మంది మరణించారు.