మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా పూనకాలు లోడ్ చేయడానికి ముస్తాబయింది. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని మెగాస్టార్ చిరు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో మెగాస్టార్ జోష్ చూస్తుంటే పూనకాలే అనిపిస్తుంది. ప్రమోషన్స్ లో కూడా చిరు ఏ మాత్రం తగ్గడం లేదు. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక విశాఖపట్నంలో జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో మెగాస్టార్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. అలానే విశాఖపట్నంలో సెటిల్ అవ్వాలనేది చిరకాల కోరిక.. త్వరలోనే ఇల్లు కట్టుకుంటాను అని కూడా అన్నారు. దీంతో విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
చిరంజీవి విశాఖపట్నంలో స్థిరపడితే అంతకంటే మంచి విషయం ఇంకేముంటుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ‘ఆంధ్ర రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖపట్నంలో మెగాస్టార్ చిరంజీవి స్థిరపడాలనుకోవడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. సినీ పరిశ్రమ విశాఖకు రావాలని సీఎం జగన్ ఆ మధ్య హీరోలని కోరిన విషయం తెలిసిందే. సినిమా రంగానికి కావాల్సిన ఏర్పాట్లు, హీరోల నివాసం కోసం స్థలాలు కూడా ఇప్పిస్తానని జగన్ హామీ కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో చిరంజీవి విశాఖలో స్థిరపడాలన్న కోరికను బయటపెట్టడంతో సినీ పరిశ్రమ విశాఖకు తరలి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే విశాఖ.. మరో విశ్వనగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిరు వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరు నిర్ణయాన్ని విజయసాయి రెడ్డి సమర్ధించారు. చిరు నిర్ణయాన్ని స్వాగతించిన విజయసాయి రెడ్డిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
I heartily welcome megastar @KChiruTweets garu’s decision to settle down in the executive capital of AP, Visakhapatnam. I sincerely wish his upcoming movie #waltairveeraih a grand success. pic.twitter.com/wDYs3JH9UW
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 9, 2023