ఈ మద్య మత్స్యకారుల వలలకు ఎన్నో చిత్ర విచిత్రమైన చేపలు చిక్కుతున్నాయి. కొన్ని చేపలు మత్స్యకారులకు కాసులు కురిపిస్తున్నాయి. మరికొన్ని చేపల వల్ల భారీ నష్టాన్ని చవిచూస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. విశాఖ రుషికొండ సమీప కార్తికవనం వద్ద సముద్రంలో మంగళవారం ఈ అరుదైన చేప వలలో పడింది. ఈ చేపను చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు.
తల భాగంలో ముళ్లతో పెద్ద కళ్లతో విచిత్రంగా కనిపిస్తున్న సముద్రజీవిని జాలర్లు ముళ్ల కప్ప అంటారు. దీని వ్యవహారిక నామం ‘పఫర్ ఫిష్’ అని విశాఖ మత్స్య శాఖ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. చిన్న చేపలు, నాచు తింటూ మనుగడ సాగిస్తుంది. అయితే ఈ కప్పలు.. ప్రమాద సమయాల్లో రక్షణ కోసం తల భాగంలోని ముళ్లతో ప్రతిఘటిస్తాయని చెప్పారు. ఇవి ఒక్కోటి సుమారు రెండు కిలోలకుపైగా బరువు పెరుగుతాయన్నారు. విచిత్రంగా కనిపిస్తున్న ఈ చేపను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.