ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చోప్పున ఇవ్వాలని అలాగే తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు.. మామూలుగా గాయాలైన వారికి రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి వెంటనే నివేధిక ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ను, ఎస్పీని ఆదేశించారు.
అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో బుధవారం రాత్రి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోగా.. పదమూడు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తొలుత నూజివీడు ఆసుపత్రికి తరలించారు. తర్వాత విజయవాడకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.