సాధారణ ప్రయాణికుల రవాణలో ముఖ్యమైనది బస్సు రవాణ. ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో బస్సు లది కీలక పాత్ర. అందుకే అంటారు..’ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం’ అని. అయితే ఆగస్టు 15 సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రయాణికులకు అందించనుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
గత కొంత కాలంగా తెలంగాణ ఆర్టీసీ నష్టాలలో కొనసాగుతోంది. అయినప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నడుపుతోంది. సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికి ప్రయాణికులకు రాయితిలు కల్పిస్తూనే ఉంది. ఆర్టీసీ MDగా వీసీ సజ్జనార్ నియమితులైనప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు.
అందులో భాగంగానే ఆర్టీసీ లో కార్గో సేవలను ప్రారంభించి సంచలనం సృష్టించారు. మరోసారి ప్రయాణికులకు స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా ఆర్టీసీ సరికొత్త ఆఫర్లను ప్రయాణికులకు అందించేందుకు ముందుకు వచ్చింది.
ఆగస్టు 15 సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ప్రకటించిన ఆఫర్ల వివరాలు..
ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లోప్రతీ రోజు ఉదయం 11గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. ఆగస్టు 13 నుంచి15వ తేదీ వరకు అన్ని ఆర్టీసీ బస్సులకు జాతీయ జెండాను ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగులంతా ఆజాదీ కా అమృతోత్సవ్ బ్యాడ్జీలతోనే విధులకు రావాలని యాజమాన్యం ఆదేశించింది.
ఈ ఆఫర్లను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ సదుపాయాలను ప్రయాణికులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరి ఆర్టీసీ ఇలాంటి అద్భుతమైన ఆఫర్లను ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Come Let’s celebrate #AzadiKaAmritMahotsav with #TSRTC #75thIndependenceDay Special Buses rolling out on roads from today #HarGharTiranga pic.twitter.com/kmZ1SUt19E
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) August 8, 2022