ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్ ఒకెత్తు.. ఆదివారం భారత్- పాక్ మధ్య జరిగిన మ్యాచ్ ఒకెత్తు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి బాల్ ఉత్కంఠగా సాగింది. ఆఖరి వరకు మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేపింది. విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటానికి అంతా దాసోహం అన్నారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవెలియన్కు క్యూ కడుతోంటో.. విరాట్ కోహ్లీ నిలబడిన తీరు అందరినీ అబ్బుర పరిచింది. విరాట్ అసలు సిసలైన ఛాంపింయన్ అని అంతా నమ్మేలా చేశాడు. తనలో సత్తా ఇంకా అలాగే ఉందని ప్రపంచానికి చాటి చెప్పాడు. కేవలం 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా సైతం మ్యాచ్లో కీలక పాత్ర పోషించాడు. ఇద్దరూ కలిసి టీమిండియాకి విజయాన్ని కట్టబెట్టారు.
ఈ మ్యాచ్పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు మళ్లీ ఆ మ్యాచ్ని బాల్ టూ బాల్ మొత్తం మ్యాచ్ని స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారం చేయనున్నారు. ఈ మ్యాచ్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమా హీరోలు, డైరెక్టర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అంతా తమ ఆనందాన్ని పంచుకున్నారు. అందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా అతీతుడేమీ కాదు. ఆయన కూడా మ్యాచ్కు సంబంధించి తన అభిప్రాయాలను, ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నిజానికి ఇలాంటి విషయాలపై సుందర్ పిచాయ్ చాలా తక్కువగా స్పందిస్తుంటారు. అయితే ఈసారి స్పందించడమే కాదు.. ఒకరికి కౌంటర్ కూడా ఇచ్చారు.
Happy Diwali! Hope everyone celebrating has a great time with your friends and family.
🪔 I celebrated by watching the last three overs again today, what a game and performance #Diwali #TeamIndia #T20WC2022— Sundar Pichai (@sundarpichai) October 24, 2022
విషయం ఏంటంటే.. ఆదివారం జరిగిన భారత్- పాక్ మ్యాచ్కి సంబంధించి సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. “అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. అందరూ మీ మిత్రులు, కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతున్నారని ఆశిస్తున్నాను. నేను అయితే మరోసారి చివరి 3 ఓవర్లు మరోసారి చూసి సంబరాలు చేసుకున్నాను” అంటూ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. అందుకు ఓ పాక్ అభిమాని “మీరు మొదటి మూడు ఓవర్లు కూడా చూడాల్సింది” అంటూ కౌంటర్ వేసేందుకు ప్రయత్నించాడు. అందుకు గూగుల్ సీఈవో ఓ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. “ఆ మూడు ఓవర్లు కూడా చూశాను.. భువనేశ్వర్, అర్షదీప్ ఎంతో గొప్పగా బౌలింగ్ చేశారు” అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. అయితే పాక్ అభిమాని టీమిండియా బ్యాటింగ్ 3 ఓవర్లు చూడాల్సింది అని చెప్పగా.. అందుకు సుందర్ పిచాయ్ వాళ్ల బంగపాటును గుర్తు చేశాడు. అయితే నెట్టింట అతడిని.. గూగుల్ సీఈవో రిప్లై ఇచ్చాడు నీకు. ఆ స్క్రీన్ షాట్స్ ని ఫ్రేమ్ కట్టించుకో అంటూ సలహాలు ఇస్తున్నారు.
you should watch 1st three overs
— Muhammad Shahzaib (@Muhamma91436212) October 24, 2022
Did that too:) what a spell from Bhuvi and Arshdeep
— Sundar Pichai (@sundarpichai) October 24, 2022
What it meant to win at The G!
Scorecard https://t.co/mc9useyHwY #TeamIndia | #T20WorldCup | #INDvPAK | @imVkohli pic.twitter.com/A1uFG5Lbxr
— BCCI (@BCCI) October 23, 2022