క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు హాట్ టాపిక్ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం. దీనిపై పలు విమర్శలు, అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీని ఎందుకు కెప్టెన్సీ నుంచి తప్పించారు? బీసీసీఐ ప్రెసిడెంట్ గా గంగూలీ కావాలనే అలా చేయించాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మొదటి నుంచి కోహ్లీపై గంగూలీకి అంత మంచి అభిప్రాయం లేదని కూడా కొందరు అభిప్రాయ పడుతున్నారు. అందులో భాగంగానే సమయానుసారంగా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించారని.. రానున్న రోజుల్లో టెస్టు కెప్టెన్సీపై కూడా వేటు వేసే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు గంగూలీకి- కోహ్లీకి ఎక్కడ చెడింది? ఎందుకు ఆ మాటలు వినిపిస్తున్నాయో పరిశీలిద్దాం.
The All-India Senior Selection Committee also decided to name Mr Rohit Sharma as the Captain of the ODI & T20I teams going forward.#TeamIndia | @ImRo45 pic.twitter.com/hcg92sPtCa
— BCCI (@BCCI) December 8, 2021
గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లో.. పలు చర్యలు, నిర్ణయాలు తీసుకున్నాడు. అంతే కాకుండా అనిల్ కుంబ్లేని హెడ్ కోచ్ గా తీసుకురావాలని గంగూలీ చాలానే ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. అది కోహ్లీ, రవిశాస్త్రి విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న సమయం కావడంతో.. గంగూలీ నిర్ణయానికి వీళ్లిద్దరే మోకాలడ్డు పెట్టారనేది టాక్. అప్పటి నుంచి కోహ్లీకి గంగూలీకి ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదని.. రవిశాస్త్రి పదవీ విరమణ తర్వాత కోహ్లీకి సపోర్ట్ కూడా తగ్గిపోయింది. అదును చూసి గంగూలీ కావాలనే కోహ్లీని టార్గెట్ చేసి ఇలా అవమానించాడంటూ మాట్లాడుకుంటున్నారు. కోహ్లీ- గంగూలీ విషయంలో వస్తున్న వార్తలు, వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🔝#TeamIndia #INDvNZ pic.twitter.com/95SDwdID2U
— BCCI (@BCCI) December 6, 2021