న్యూ ఇయర్ వేడుకలను తన ఫ్యామిలీలో జరుపుకోవడానికి ఇంటికి వెళ్తున్న రిషభ్ పంత్.. కారు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. యాక్సిడెంట్ లో తీవ్రగాయాల పాలైయ్యాడు పంత్. దాంతో రూర్కీలోని ఆస్పత్రిలో అతడిని అడ్మిట్ చేశారు. అక్కడే అతడికి చికిత్స జరుగుతోంది. అయితే రిషభ్ పంత్ ను మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలిస్తున్నట్లు డెహ్రడూన్ క్రికెట్ అసోషియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ ప్రముఖ న్యూస్ ఛానల్ కు తెలిపారు. ప్రస్తుతం అతడు డెహ్రడూన్ లోని ఓ ప్రయివేట్ హస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
రిషభ్ పంత్.. కుటుంబంతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి తన స్వస్థలం వెళ్తున్న క్రమంలో.. రూర్కీ సమీపంలో యాక్సిడెంట్ కు గురైయ్యాడు. దాంతో అతడిని రూర్కీలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం డెహ్రడూన్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు పంత్. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం పంత్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే పంత్ ను మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలిస్తున్నామని డెహ్రాడూన్ క్రికెట్ అసోషియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని, అయితే మంచి చికిత్స అందించాలన్న ఉద్దేశంతోనే అతడిని ఈ రోజు (బుధవారం) ముంబైకి తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఇక పంత్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ అభిమానులతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇక పంత్ కు అయిన గాయాల కారణంగా అతడు ఆస్ట్రేలియా సిరీస్ తో పాటుగా ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్ లకు లేదా అన్ని మ్యాచ్ లకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Cricketer #RishabhPant will be shifted to Mumbai today for further treatment: Shyam Sharma, Director DDCA tells ANI
Pant is currently undergoing treatment at a private hospital in Dehradun following a car accident on December 30th pic.twitter.com/E9IZtNAHL7
— Hindustan Times (@htTweets) January 4, 2023