టీమిండియా, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం ప్రారంభం కావాల్సిన మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలుకానుంది. దీనికి తోడు భారత్ జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టెస్ట్కు దూరమయ్యారు. ఇప్పటికే గెలవాల్సిన మొదటి మ్యాచ్లో డ్రాతో సరిపెట్టుకున్న టీమిండియా టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ర్యాంకింగ్స్లో వెనుకబడింది.
ఇప్పుడు రెండో టెస్ట్కు ముందు కీలక ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలు మ్యాచ్కు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇలా కీలక ఆటగాళ్లు లేకపోవడం టీమిండియా విజయవకాశాలపై ప్రభావం చూపిస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో టామ్ లాథమ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
NEWS – Injury updates – New Zealand’s Tour of India
Ishant Sharma, Ajinkya Rahane and Ravindra Jadeja ruled out of the 2nd Test.
More details here – https://t.co/ui9RXK1Vux #INDvNZ pic.twitter.com/qdWDPp0MIz
— BCCI (@BCCI) December 3, 2021