లెజెండరీ క్రికెట్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత తారక్ సిన్హా కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో పోరాడుతూ శనివారం 71వ ఏట మరణించారు. ఢిల్లీకి చెందిన తారక్ సిన్హాకు 2018లో ద్రోణాచార్య అవార్డు లభించింది. సిన్హా న్యూఢిల్లీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దేశ్ ప్రేమ్ ఆజాద్, గురుచరణ్ సింగ్, రమాకాంత్ అచ్రేకర్, సునీతా శర్మ తర్వాత ద్రోణాచార్య అవార్డు అందుకున్న ఐదవ భారత క్రికెట్ కోచ్ తారక్ సిన్హా. ఢిల్లీకి చెందిన ఫేమస్ సోనెట్ క్లబ్లో ఆయన్ను అందరూ తండ్రి సమానుడిగా భావిస్తారు.
దేశీయ, అంతర్జాతీయ క్రికెట్కు భారత్ తరపున ఆడిన ఎంతో మంది క్రికెటర్లను తారక్ తీర్చిదిద్దారు. ‘సోనెట్ క్లబ్ వ్యవస్థాపకుడు తారక్ సిన్హా రెండు నెలల పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్తో పోరాడి శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూసిన విషాద వార్తను బరువెక్కిన హృదయంతో పంచుకుంటున్నాం’ అని సోనెట్ క్రికెట్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. రిషబ్ పంత్, ఆశిష్ నెహ్రా, సంజీవ్ శర్మ, ఆకాష్ చోప్రా, శిఖర్ ధావన్, అంజుమ్ చోప్రా, సురేందర్ ఖన్నా, రణధీర్ సింగ్, రామన్ లాంబా, మనోజ్ ప్రభాకర్, అజయ్ శర్మ, కె.పి. భాస్కర్, అతుల్ వాసన్ లకు తారక్ సిన్హా కోచ్ గా పనిచేశారు.
ఈ ప్లేయర్లు అంతా ఢిల్లీ క్రికెట్ తరపున, ఆ తర్వాత భారత జట్టు తరపున ఆడారు. మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కూడా తారక్ క్లబ్లోనే రాటుతేలారు. తారక్ సార్ దేశానికి అసాధారణమైన అంతర్జాతీయ క్రికెటర్లను అందించడానికి జీవితాంతం కృషి చేశారని రిషబ్ పంత్ చెప్పారు.
Saddened to hear about the demise of Tarak Sinha sir, one of the best coaches in the country, one that provided India and Delhi with some of the finest cricketers in the country. Even at 70, he used to be a regular at Sonnet.#CricketTwitter
— Shiv Dhawan (@shivdhawan10) November 6, 2021
My heartfelt condolences to the family, friends and trainees of Tarak Sinha Sir. Never met him but heard so many inspirational stories from Nehra and @cricketaakash His contribution to Indian Cricket will be forever remembered. May his soul Rest In Peace. Om Shanti 🕉️ https://t.co/NIxI8111H9
— VVS Laxman (@VVSLaxman281) November 6, 2021