మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కిృత నేత నూపుర్ శర్మ కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ క్రమంలో తనకు ఉన్న ప్రాణా హాని, అత్యాచారా బెదిరింపుల నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసులను విచారణను ఢిల్లీకి బదిలీ చేసేలా అదేశాలు ఇవ్వాలంటూ నూపుర్ శర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. నూపుర్ శర్మపై తీవ్ర స్థాయిలో మండిపడింది. అధికారం ఉందనే పొగరు తలకెక్కి నూపుర్ శర్మ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని సుప్రీం కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది.
బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మ.. తనపై నమోదైన కేసుల FIRలను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీకోర్టు విచారణ చెపట్టింది. ఈ సందర్బంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యనిస్తూ..ఆమె నోటి దురుసుతనం దేశమంతటా మంటపెట్టింది. రావణ కాష్టాన్ని రగిల్చింది. నూపుర్ శర్మ వ్యాఖ్యల వల్లే ఉదయ్పూర్ ఘటన కూడా జరిగింది. ఆమె యావత్ దేశానికి మీడియా ద్వారా క్షమాపణలు చెప్పాల్సిందే.. అంటూ వ్యాఖ్యానించింది. ఒక అజెండాను ప్రచారం చేయడం తప్ప.. టీవీ ఛానెల్, నూపుర్ శర్మల చర్చ వల్ల ఒరిగింది ఏమిటి? అని సూటిగా ఆమె తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.
దీనికి ఆమె తరపున సీనియర్ అడ్వొకేట్ మణిందర్ సింగ్ సమాధానమిస్తూ.. ప్రవక్త వ్యాఖ్యలపై ఆమె ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని నూపుర్ శర్మ తరఫు న్యాయవాది..కోర్టులో చెప్పగా.. జస్టిస్ సూర్య కాంత్ కలగజేసుకుని.. ఆమెకు ముప్పు ఏర్పడిందా? ఆమె వల్ల దేశం మొత్తం రగిలిపోతోంది అంటూ మండిపడ్డారు. ఆమె నోటి దురుసు తనంతో.. అధికారం ఉందనే తలపొగరుతో ఆమె చేసిన వ్యాఖ్యలు.. దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టాయి.
ఆమెది సరిదిద్దుకోలేని పొరపాటని బెంచ్ అభిప్రాయపడింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసింది నూపుర్ శర్మనేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ లన్నింటిని కొట్టేస్తూ.. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని నూపుర్ శర్మ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది. మరి.. నూపుర్ శర్మ పై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.