మధ్యాహ్న భోజన పథకం ఎంతో మంది పేద విద్యార్థులకు వరం. కానీ అదే భోజనం.. తమకు శాపంగా మారుతుందని ఆ విద్యార్థులు ఊహించలేదు. రోజులానే ఆహారాన్ని తిన్న విద్యార్థులు.. ఒక్కొక్కరిగా అనారోగ్యానికి గురయ్యారు. తమకు ఏం జరిగిందో తెలియని అనిశ్చిత స్థితికి చేరుకున్నారు. వారి పరిస్థితిని చూసిన స్కూల్ యాజమన్యం కూడా .. ఒక్కసారిగా ఖంగుతింది. హుటా హూటిన సమీపంలోని ఆసుప్రతికి తరలించింది. అయితే వీరు తిన్న ఆహారంలో పాము ఉన్నట్లు వండిన వ్యక్తి గుర్తించడంతో.. ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బీర్బూమ్ జిల్లాలో చోటు చేసుకుంది. యమూరేశ్వర్ బ్లాక్ లో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం భోజనం తిన్నారు.
అనంతరం వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. సుమారు 30 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో తక్షణమే స్పందించిన పాఠశాల యాజమాన్యం రామ్ ఫూర్ హట్ మెడికల్ కాలేజీకి తరలించింది. ఈ విషయం ఆ నోట.. ఈ నోట ఆ చుట్టూ ఉన్న గ్రామస్తులకు చేరింది. దీంతో వెంటనే వారు బ్లాక్ డెవలప్ మెంట్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన.. జిల్లా ఇన్ స్పెక్టర్ కు సమాచారం అందించారు. కాగా, మధ్యాహ్న భోజనం సిద్ధం చేసిన వ్యక్తి.. తాను వండిన ఆహారంలో పాము ఉన్నట్లు గుర్తించానని ఒక్కసారిగా బాంబు పేల్చడంతో.. గ్రామస్థులంతా ఆగ్రహానికి గురయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వెళ్లగొట్టడంతో పాటు.. ఆయన ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. అయితే ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని, వారిని డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Sometimes bombs in the school field and sometimes snakes in the mid-day meal! Are the children of Paschim Banga safe in this TMC regime? pic.twitter.com/ExTfjLdQyv
— Office of Dilip Ghosh (@DilipGhoshOff) January 9, 2023
State of West Bengal A whole snake in the mid-day meal of p.s Mayureshwar Mandalpur Primary School in Birbhum.
Many children are sick after eating this cooked food.
Who is responsible for this ?? @MajiDevDutta @jdhankhar1 @rashtrapatibhvn @SuvenduWB @anjanaomkashyap @aajtak pic.twitter.com/RyBJBJKvl0— Rajesh Dutta (@RajeshD35635873) January 9, 2023