నేటికాలంలో మహిళలు ఎంతో అభివృద్ధి చెందారు. అంతేకాక మగవారితో ధీటుగా అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇంటి పని దగ్గర నుంచి అంతరిక్షంలో వెళ్లే రాకెట్ పనితీరు వరకు ప్రతి విషయంలో ఆడవారి పాత్ర ఉంటుంది. మగవారు సాధించేలేని అనేక ఘనతలు వారు సాధించారు. అందుకే అనేక మంది మహిళలు తమదైన ప్రతిభతో చరిత్రలో నిలిచిపోయారు. అలానే ఓ మహిళ కూడా తనదైన ప్రతిభతో ఓ అరుదైన ఘనత సాధించింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రియాంకా శర్మ రాష్ట్రంలో తొలి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నియమితులయ్యారు. యూపీఎస్ ఆర్టీసీ నియమించిన 26 మంది మహిళ డ్రైవర్లో ప్రియాంక అనేక సవాళ్లను అధికమించి మొట్ట మొదటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా నిలిచింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రియాంక .. తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. మద్యానికి బానిసైన ప్రియాంక భర్త.. పెళ్లైన కొన్నాళ్లకే మరణించాడు. ఇక అప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టడంతో వారి బాధ్యతం ఆమెపై పడింది. అప్పటి వరకు ఇంట్లోనే భర్తకు, పిల్లలకు పనులు చేస్తూ గడిపిన ప్రియాంక ..భర్త మరణంతో బయటి ప్రపంచంలోకి రావాల్సి వచ్చింది. పిల్లలను పోషించేందుకు ఎన్నో పనులు చేసింది. అంతేకాక వారి కోసం రాష్ట్రాలు దాడి వెళ్లి మరి పనులు చేసింది. అలానే పనుల కోసం ఢిల్లీ వెళ్లి పడరాని పాట్లు పడింది. అలా వచ్చిన అరకొర డబ్బులతో పిల్లలను పోషించేది.
అలానే ఢిల్లీలోని ఓ కంపెనీలో హెల్పర్ గా చేరింది. అదే సమయంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంది. అంతేకాక పెద్దవాహనాలను నడపాలనే ఆసక్తి ఆమెలో పెరిగింది. దీంతో ఆ డ్రైవింగ్ శిక్షణ కోసం ప్రియాంక ముంబై, బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో తిరిగింది. చివరకు ఫోర్ వీలర్ డ్రైవింగ్ పై గట్టి పట్టు సాధించింది. ఇదే సమయంలో యూపీ ప్రభుత్వం.. ఆర్టీసీలో డ్రైవర్లుగా మహిళలకు అవకాశం ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూపీ ప్రభుత్వం మహిళలకు డ్రైవర్లుగా అవకాశం కల్పించడంతో ప్రియాంక అటువైపు దృష్టి సారించారు. యూపీ ప్రభుత్వం విడుదల చేసిన డ్రైవర్ల నోటిఫికేషన్ కోసం ప్రియాంక దరఖాస్తు చేసుకుంది. మొదటగా ఆర్టీసీ వారు నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్రియాంక విజయం సాధించారు.
అలానే డ్రైవింగ్ టెస్ట్ లో కూడా ప్రియాంక పాసయ్యారు. ఈ క్రమంలో 2022 సెప్టెంబర్ లో ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. అలా ఓ మహిళ.. సాధారణ గృహిణీ నుంచి యూపీ రాష్ట్రలోనే తొలి బస్సు డ్రైవర్ గా రికార్డు సృష్టించారు. భర్త మద్యానికి, ఇతర చెడు అలవాట్లకు బానిసగా మారి కుటుంబాన్ని పట్టించుకోకపోయినా ఆ ప్రభావం పడేది ఇంటి మహిళపైనే. బాధ్యతలేని భర్త ఉన్నా కూడా ప్రతీ భార్యా కుటుంబం కోసం ఏదోక పని చేసిన తన పిల్లలను పోషించుకుంటుంది. అలాంటి కోవకు చెందిన వారే ఈ ప్రియాంక శర్మ. మరి.. ఈమె గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Meerut, UP | Priyanka Sharma became the first woman govt bus driver in Uttar Pradesh
After both kidneys of my husband failed, all responsibility fell on me. We have 2 children & didn’t have a house to live in: Priyanka Sharma, bus driver (22.12) pic.twitter.com/bAY7wYQ6PO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 23, 2022