జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజా(పన్ను వసూలు కేంద్రం)ల విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు. జాతీయ రహదారిపై 60 కిలోమీటర్ల పరిధిలోనే రెండు ప్లాజాలు ఉన్నట్లైతే వాటిని రద్దు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. శాఖకు నిధుల కేటాయింపుపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: భూం భూం బీర్, పవర్స్టార్ బీర్లు తెచ్చింది చంద్రబాబే: సీఎం జగన్
‘జాతీయ రహదారిపై 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్ ప్లాజాలు ఉండకూడదు. కానీ, కొన్ని ప్రాంతాల్లో అలా ఉన్నాయి కూడా. అది తప్పు మాత్రమే కాదు.. చట్టవిరుద్ధం కూడా. డబ్బులొస్తున్నాయి కదా అని ఆలోచిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. 60 కిలోమీటర్ల పరిధిలో రెండో టోల్ ప్లాజా ఉంటే వచ్చే మూడు నెలల్లో వాటిని తొలగిస్తాం. టోల్ ప్లాజాకు దగ్గరగా నివసించే ప్రజలు తమ ఆధార్ కార్డులు చూపించి పాస్ లు తీసుకోవచ్చు’ అంటూ గడ్కరీ స్పష్టం చేశారు. నితిన్ గడ్కరీ వ్యాఖ్యలై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
All toll collecting points which are within 60 km of each other on the National Highways will be closed in the next three months. : Union Minister Shri @nitin_gadkari ji pic.twitter.com/RSmMUaJFVE
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) March 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.