ఇండియా-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతాలు ఎప్పుడు చూడు ఉద్రిక్తంగా ఉంటాయి. నిత్యం ఎన్నో చోరబాట్లు చేటుచేసుకుంటాయి. ఉగ్రవాదులు నిత్యం మన దేశంలోకి అగుడుపెట్టాలని ఎన్నో విధాలుగా ట్రై చేస్తారు. ఎంత గట్టిగా నిఘా పెట్టినా సరే.. ముష్కరులు ఏదో విధంగా మన దేశంలో అడుగుపెట్టడానికి.. ఇక్కడ అల్లోకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా కొందరు టెర్రరిస్టులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నంచారు. ఈ క్రమంలో వారు బాంబు మీద కాలు పెట్టి పేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోని తాజాగా ఆర్మీ విడుదల చేసింది. జమ్ముకశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటన మూడు రోజుల క్రితం అనగా ఆగస్టు 22న నౌషేరా సెక్టార్లో నియంత్రణ రేఖకు 150 మీటర్ల దూరంలో చోటు చేసుకుంది. ఈ ప్రాతంలో పాకిస్తాన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని భారత ఆర్మీ గుర్తించింది. అయితే ఆ ఉగ్రవాదులు అక్కడి మైన్ఫీల్డ్లోకి ప్రవేశించి ల్యాండ్ మైన్పై అడుగుపెట్టారు. దీంతో అది పేలడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇక ఈపేలుడు తర్వాత మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను డ్రోన్ ద్వారా గుర్తించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.
సోమవారం, మంగళవారం మధ్య రాత్రి సమయంలో నౌషేరా సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద భారత్ భూభాగం వైపు ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ పేలుడులో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియోను భారత ఆర్మీ విడుదల చేసింది. ఇద్దరు పాక్ ఉగ్రవాదులు మైన్ఫీల్డ్లోకి ప్రవేశించిన తర్వాత పేలుడు సంభవించింది. అనంతరం ఉగ్రవాదులు మరణించిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | On Aug 22, suspicious movement of 2 terrorists from Pakistan-based terror orgs approx 150m on Indian side of LoC was detected. Blast was thereafter observed & it was assessed that they stepped over minefield. Later, bodies were seen. Today bodies recovered: Army Sources pic.twitter.com/EP2IzVYq9L
— ANI (@ANI) August 24, 2022