దేశంలో కరోనా కష్ట కాలంలో ఓ వైపు ప్రభుత్వాలు పేద ప్రజలకు సహాయం చేస్తున్నప్పటికీ.. నేనున్నా అంటూ ముందుకు వచ్చాడు నటుడు సోనూసూద్. ఎంతో మంది పేద ప్రజల కష్టాన్ని దూరం చేశాడు.. వేల మందిని తన సొంత ఖర్చులతో స్వస్థలాలకు పంపించాడు. సోనూసూద్ బాధితులకు, నిర్భాగ్యులకు సాయం అందించడంలో ముందుంటాడు. ఆర్ధికంగా కష్టాల్లో ఉన్నవారిని ఇప్పటికీ ఆదుకుంటూనే ఉన్నారు సోనూసూద్.
ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర సర్కారు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. పలువురు బాధితులు మాత్రం సోనూసూద్ ని తమను రక్షించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. సోనూసూద్ సాయం కోసం సామాజిక మాధ్యమాల సాయంతో ఆయనకు వినతులు పంపుతూనే ఉన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న బాధితుల భారత్ కి తరలిస్తూ వస్తున్నారు. అయితే ఉక్రెయిన్ లో భారతీయ బాధితుల కోసం సోనూసూద్ రంగంలోకి దిగారు.
ఇది చదవండి: మరో వివాదంలో దేవిశ్రీ ప్రసాద్!
సోనూసూద్ కు చెందిన చారిటీ సంస్థ నుంచి తమకు సాయం అందడం పట్ల అక్కడి భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. సహాయక కార్యక్రమాలకు సంబంధించి సోనూసూద్ కూడా తన ట్విట్టర్ పేజీలో తాజా వివరాలను ఉంచుతున్నారు. ఈ సందర్భంగా ‘ఇది నా బాధ్యత. నా వంతుగా సాయం చేయగలిగినందుకు సంతోషిస్తున్నాను’ అంటూ సోనూ స్పందించాడు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
That’s my job.
I am glad that I was able to do my bit,
Big thank you to Government of India for all the support.
Jai hind 🇮🇳 https://t.co/KWhf7R4pP9— sonu sood (@SonuSood) March 2, 2022