ఐరాసలో కశ్మీర్ అంశంపై పాక్ ప్రస్తావించడం, భారత్ చురకలంటించడంతో మొదలైన మాటల యుద్దం.. ఇరు దేశాల మధ్య తారాస్థాయికి చేరింది. తాజాగా, పాక్ మంత్రి, అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత షాజియా, పాకిస్థాన్ ఒక అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్న దేశమని, ఈ విషయాన్ని భారత్ మరవకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్ కసాయి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై భారత్లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇది మరవకముందే పాక్ మహిళా మంత్రి రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గతవారం ఐరాస, యూఎన్ఎస్సీలో పాక్ చర్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తూర్పూరబట్టిన సంగతి విదితమే. బిన్ లాడెన్కు ఆతిథ్యం ఇచ్చినవాళ్లు, పొరుగు దేశం పార్లమెంట్పై దాడిచేసిన దేశానికి నీతులు చెప్పే అర్హత లేదంటూ కౌంటర్ ఇచ్చారు. దీనికి కౌంటర్ గా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగింది. భారత ప్రధానిని ‘గుజరాత్ కసాయి’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు.. కానీ గుజరాత్ కసాయి బతికే ఉన్నాడని చెప్పాలనుకుంటున్నాను. భారత ప్రధాని మోదీకి.. అప్పట్లో మోదీకి అమెరికా వీసా నిరాకరించింది. ప్రధాని అయ్యాకే వీసా వచ్చింది.. ఆయన RSSకు ప్రధానమంత్రి..’ అని విమర్శించారు.
దీనిపై స్పందించిన భారత్, పాక్ విదేశాంగ మంత్రి పిచ్చి ప్రేలాపన ఆ దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను నియంత్రించలేని అసమర్థతకు నిదర్శనంగా కనిపిస్తోందని దుయ్యబట్టింది. ఇది మరవకముందే పాక్ మహిళా మంత్రి రెచ్చే గొట్టే వ్యాఖ్యలు చేసింది. పాక్ ఒక బాధ్యతాయుత అణు దేశమని ట్వీట్ చేసిన మంత్రి షాజియా, ఈ విషయాన్ని భారత్ మరవకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయన్న విషయాన్ని భారత్ మరవకూడదు.. మా అణ్వాయుధాలు మౌనంగా ఉండడానికి మాత్రమే కాదు.. అవసరం వస్తే వెనక్కి తగ్గేది లేదు. ఎలా జవాబు ఇవ్వాలో పాకిస్థాన్ కు తెలుసు. చెంపమీద కొడితే ఊరికే చూస్తూ ఉండిపోదు. అదే స్థాయిలో బదులిస్తుంది. భారత ప్రధాని మోదీ దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. హిందూయిజం, హిందుత్వ అంశాలు మోదీ ప్రభుత్వంలో విజృంభిస్తున్నాయి. భారత్ ముస్లింలను ఉగ్రవాదంతో ముడివేస్తోంది..” అంటూ షాజియా రెచ్చగొట్టేలా మాట్లాడారు.
Pakistan is a responsible nuclear state. Some elements in Indian media trying to create panic. Pakistan’s FM responded to inciting comments by Indian Minister. Pakistan has sacrificed far more than India in the fight against terrorism.Modi Sarkar is promoting extremism & fascism. https://t.co/3v4psXRfWk
— Shazia Atta Marri (@ShaziaAttaMarri) December 17, 2022