అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్ లోని ఓ సూపర్ మార్కెట్ లో గుర్తు తెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పదిమంది స్పాట్ లోనే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. సైనికుడి వేషదారణలో టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్ లోకి తుపాకీతో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడ కనిపించిన వారిపై ఒక్కసారిగా భారీ కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది.
ఈ ఘటనలో పదిమంది మరీతి చెందారని సిటీ పోలీస్ అధికారి జోసెఫ్ గ్రామగ్లియా వెల్లడించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఎఫ్బీఐ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేబడుతున్నారు. అదేవిధంగా నల్లజాతీయులు అధికంగా ఉన్న చోట ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఈ భయానక కాల్పుల ఘటనకు జాతివిద్వేషమే కారణంగా భావిస్తున్నామని అధికారులు చెప్పారు. మృతుల్లో 8 మంది నల్లజాతీయులు, ఇద్దరు తెల్ల జాతివారు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో రిటైర్డ్ పోలీస్ అధికారి కూడా ఉన్నాడని, అతడు ప్రస్తుతం సూపర్ మార్కెట్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు కూడా తెలివిగా కాల్పుల ఘటనను హెల్మెట్ కు అమర్చిన కెమెరాతో లైవ్ స్ట్రీమ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. మరి ఈ కాల్పుల ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.