స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. లైగర్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశాడు. రెండో సినిమాలోనూ విజయ్ దేవరకొండనే హీరోగా ఫిక్స్ చేశాడు. ఆ సినిమా పేరు జేజీఎం(జనగణమన) అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. జేజీఎంను లాంఛ్ కార్యక్రమాన్ని ముంబైలో అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: మహేష్ బాబు చేయాల్సిన జనగణమన విజయ్ దేవరకొండ ఖాతాలోకి!
ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో పూరీని మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మీరే చేస్తున్నారు అని టాక్ వచ్చింది. ఆ తర్వాత మీరు చేయట్లేదని తెలిసింది ఎందుకు? అనే ప్రశ్న ఎదురైంది. అందుకు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ‘నేను మెగాస్టార్ చిరంజీవిగారి 150వ సినిమా డైరెక్టర్ అనుకుని కలిశాను. ఒక మంచి కమర్షియల్ కథ చెప్పాను. మొదట ఆయనకు కథ బాగా నచ్చింది. తర్వాత ఎందుకో మనసు మార్చుకున్నారు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో కంబ్యాక్ ఇద్దామనుకున్నారు. అక్కడితో నా సినిమా పక్కకు వెళ్లిపోయింది’ అని పూరీ జగన్నాథ్ సమాధానమిచ్చాడు.
ఇంక సినిమా విషయానికి వస్తే.. జనగణమన మూవీ డైరెక్టర్ పూరీజగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. మొదట ఈ సినిమాకి హీరోగా మహేశ్ బాబును అనుకున్నాడు. అయితే మహేశ్ ఈ సినిమాకు నో చెప్పడంతో కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశాడు. ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓకే చెప్పడంతో ఇమీడియట్ గా పూరీ సినిమాని మొదలు పెట్టేశాడు. పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకోనుంది.
Words 🔥🔥@TheDeverakonda #VijayDevarakonda #JGM @PuriConnects @Charmmeofficial pic.twitter.com/3t4M95hiRp
— Govind Vyas TOOFAN (@UserDiedMacha) March 29, 2022
#VijayDevarakonda makes dashing entry at #JanaGanaMana launch in mumbai@ArtistryBuzz @TheDeverakonda #vijaydeverkonda pic.twitter.com/wBaNEZJVIZ
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) March 29, 2022