ఇటీవల కాలంలో తరచూ వన్యమృగాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. అలానే వ్యవసాయ పనులకు వెళ్లిన వారిపై దాడి చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో పెద్దపులి పిల్లలు కలకలం రేపాయి. పిల్లల కోసం తల్లిపులి వస్తుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈమధ్యకాలంలో వన్యప్రాణులు, మృగాలు జనవాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అడవుల సమీపంలో ఉండే గ్రామాల్లో మృగాలు సంచరిస్తున్నాయి. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలానే ఇప్పటికే అనేక చోట్ల ఈ వన్య మృగాల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ వన్య ప్రాణాలు సంచారంతో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు కూడా జనాలు భయపడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో పెద్దపులి పిల్లల సంచారం కలకం రేపింది. ఒక్కేసారి నాలుగు పెద్దపులి పిల్లలు కనిపించడంతో స్థానికులు భయందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నంద్యాల జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతం బాగా విస్తరించి ఉంది. అలానే ఈ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని వందల గ్రామాలు ఉన్నాయి. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, నందికొట్కూరు, వెలుగోడు ప్రాంతాల్లో తరచూ పెద్ద పులు సంచారం కనిపిస్తుంది. ఇటీవలే ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. తాజాగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పెద్దపులి పిల్లలు కలకలం రేపాయి. కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువకుడు ఈ పెద్దపులి పిల్లలను గమనించాడు.
ఈ క్రమంలో ఊర్లోని ఓ ఇంటి వద్ద గొడకు ఆనుకుని పులి పిల్లలు నిద్రిస్తున్నాయి. వీటిని గమనించిన ఆ యువకుడు గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. ఒకేసారి నాలుగు పులి పిల్లలు కనిపించడంతో అందరు భయపడుతున్నారు. తల్లి పెద్దపులి రావడంతోనే ఈ పిల్లలు కూడా వచ్చి ఉంటాయని గ్రామస్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలానే పులి పిల్లలు ఇక్కడే ఉండటంతో తల్లి పులి మళ్లీ వస్తుందేమోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి పిల్లలను తీసుకొచ్చి ఓ గదిలో బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.