ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రస్తుతం కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ శుక్రవారం విశాఖలో ప్రారంభం కానుంది. మొత్తం మూడు రోజుల పాటు జరగనుంది. ఇక, ఈ ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం సిద్దం అవుతున్న ఏపీకి గుడ్ లక్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే బెస్ట్గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ‘‘ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను నిర్వహిస్తున్న మా సోదర నగరం వైజాగ్కు.. మా సోదరి రాష్ట్రం ఏపీకి మంచి జరగాలని కోరుకుంటున్నాను.
వారికి శుభం కలుగాలి. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే బెస్ట్గా ఉండాలి’’ అని పేర్కొన్నారు. దానితో పాటు ఓ న్యూస్ కటింగ్ను ఆయన పోస్టు చేశారు. అందులో ఏపీ మంత్రులు హైదరాబాద్ను పొగుడుతున్న వార్త ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ఒక్కటిగా ఉండాలని అంటున్నారు. కాగా, ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం వైజాగ్ నగరం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సమ్మిట్ ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఆయన గురువారం రాత్రి వైజాగ్ వెళ్లనున్నారు. ప్రపంచం నలుమూలలనుంచి పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, ఇందులో పాల్గొనటానికి 12 వేలకు పైగా రిజిస్ట్రేషన్స్ నమోదు అయ్యాయి. మరి, వైరల్గా మారిన కేటీఆర్ ట్విటర్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Good luck to our younger brother Vizag & sister state AP as they conduct their Global Investors Summit
I wish them the very best 👍
May both Telugu speaking states prosper and be the best in India pic.twitter.com/v6UhGlZ7qP
— KTR (@KTRBRS) March 2, 2023