అంతరిక్ష పరిశోధన కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ ఇస్రో. ఈ సంస్థ దేశ అభివృద్ది లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ది చేసేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థలో ఒకటిగా ఇస్రో నిలుస్తుంది. ఇస్రో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నెల 23 మరో రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్దమైంది ఇస్త్రో. బ్రిటీష్ స్టార్టప్ ‘వన్ వెబ్’ సంస్థకు సంబంధించిన 36 శాటిటైల్లను ఏక కాలంలో అంతరిక్షంలోకి పంపించేందికు సన్నద్దం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో శ్రీహరి కోట నుంచి ఈ నెల 22 రాత్రి లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో సంస్థ అన్నీ సిద్దం చేస్తుంది. ఈసారి మరో అద్బుతమైన రికార్డు క్రియేట్ చేసేందుకు ఇస్త్రో సంసిద్దమవుతుంది. ఒకేసారి 36 విదేశీ ఉప ప్రగహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్త్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి వ్యాపార పరమైన ఎన్నో లాభాలు కలిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 36 ఉపగ్రహాల ప్రయోగానికి వన్ బెబ్, ఎన్ఎస్ఐఎల్ మద్య ఇటీవల ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు.
ఇందులో మెజారిటీ వాటాలు ఎయిర్ టేల్ ప్రమోటర్ అయినటుంటి భారతీ ఎంటర్ ప్రైజెస్ కి ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రయోగం ఎప్పుడో చేయాల్సి ఉన్నప్పటికీ.. పలు కారణాల వల్ల దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఒక్కో ఉపగ్రహ బరువు సుమారు 150 కిలోలు ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేసిన ఇస్త్రో ఈ ప్రయోగంతో ప్రపంచంలో మరోసారి తనదైన మార్క్ చాటుకునే అవకాశం ఉంది.
Exciting news from India as we confirm the encapsulation of our 36 satellites ahead of #OneWebLaunch14. The satellites have now travelled to be attached to the LVM3 rocket ahead of launch later this month.
Thanks again to our team, as well as @isro, @NSIL_India and @Arianespace! pic.twitter.com/3y5xK0PokE
— OneWeb (@OneWeb) October 14, 2022