ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మంత్రి బొత్స మాట్లాడుతూ..”శాసన సభ.. చట్టాలను చేయవద్దంటే ఎలా కుదురుతుంది. రాజ్యాంగానికి లోబడే వ్యవస్థ అయిన పని చేయాలి. ఇది చర్చనీయాంశం. దీనిపై చర్య జరగాలి. 2024 వరకు ఏపీకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చట్టం చేశారు. శివరామకృష్ణ కమిటీని వేసి రాజధాని నిర్ణయం తీసుకోవాలన్నారు.
చంద్రబాబు స్వార్ధం కోసం నిర్ణయాలు తీసుకుంటారు.ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు వారు తీసుకోరు. శివరామకృష్ణ కమిటీని వేసి రాజధాని నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ.. కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకటన ఏదైనా పార్లమెంట్కు పంపలేదు. కాబట్టి హైదరాబాదే 2024 వరకు రాజధానే. గత ప్రభుత్వం రాజధాని వ్యవహారం లో చట్టబద్ధంగా వ్యవహరించలేదు.పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్నాం” అని బొత్స తెలిపారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.