విజయనగరం వైసీపీ పార్టీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. అకస్మాత్తుగా రాత్రి ఇంట్లో పడిపోయిన అంబటి అనిల్ ను వెంటనే విజయనగరం లోని ఓ ప్రముఖ ఆస్పత్రి కి కుటుంబ సభ్యులు తరలించినట్లు సమచారం. అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడైన అంబటి అనిల్ అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి చురుకైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే ఆయన విజయనగరం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అయ్యారు. జిల్లా పరిషత్ లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్పీటీసీగా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నారు.
అంబటి అనిల్ మృతి పట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. అనిల్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. జిల్లా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అనిల్ మృతి పట్ల జిల్లా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.