ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ రేట్లను దృష్టిలో పెట్టుకుని కొత్తగా వాహనం కొనాలనుకుంటున్న వారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, కొన్ని కొన్ని సార్లు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఈ వాహనాల్లోని బ్యాటరీలు పేలి చాలా మంది మృత్యువాతపడ్డారు. ఇలాంటి ఘటనలు ఒక ఎత్తయితే.. ఓ కొత్త ఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనం రెండుగా చీలింది. ఈ ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మహిళ భర్త సంకిత్ పర్మార్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. ఆ ట్వీట్లో.. ‘‘ నిన్న నా భార్య భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె రాత్రి 9.15 గంటల ప్రాంతంలో ఓ ఎలక్ట్రిక్ వాహనంపై వెళుతూ ఉంది.
ఆ స్కూటీపై ఆమె కేవలం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆమె నడుపుతున్న స్కూటీ ముందు చక్రం రెండుగా విడిపోయింది. దీంతో గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడింది. తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతడు చేసిన ట్వీటు.. యాక్సిడెంట్ తాలూకూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. పారా హుషార్!’’.. ‘‘భగవంతుడు ఆమెను కాపాడాలని కోరుకుంటున్నా’’.. ‘‘ ఎలక్ట్రిక్ వాహనాలు అందుకే కొనకూడదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yestrday a horrific incident took place with my wife. She was riding her @OlaElectric at 9.15pm at a speed of about 35kmph when her front wheel just broke out of the suspension.She was thrown away in front and is in the ICU facing severe injuries. Who is responsible?@bhash pic.twitter.com/Ko8fmkiNGL
— Samkit Parmar (@SamkitP21) January 22, 2023