మెల్బోర్న్ వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైఓల్టేజీ మ్యాచులో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయమ సాధించిన సంగతి తెలిసిందే. బంతి బంతికి విజయం దోబూచులాడుతున్న తరుణాన విరాట్ కోహ్లీ తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని మేల్కొలపడంతో టీ20 ప్రపంచ కప్లో భారత్ విజయ దుందుభి మోగించింది. ఈ విజయంతో భారత అభిమానులు దీపావళి సెలెబ్రేషన్స్ ఘనంగానే జరుపుకున్నారు. అయితే అదే సమయంలో మనకి తెలియని మరో ఆశ్చర్యకర ఘటన కూడా నమోదయ్యింది. కోహ్లీ దెబ్బకు దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు ఆగిపోయాయి. అందుకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అదే చివరి వరకూ ఆ టెన్షన్ కొనసాగితే ఆ కిక్కే వేరు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో అదే జరిగింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని విధంగా సాగింది. అయితే చివరి బంతికి విజయం భారత్నే వరించింది. అయితే ఈ సమయంలో దేశంలో యూపీఐ లావాదేవీలు భారీగా పతనమయ్యాయి. అందుకు సంబంధించిన గ్రాఫ్ రెప్రెసెంటేషన్ ను మ్యాక్స్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మిహిర్ వోరా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఆదివారం దేశంలో జరిగిన ఆన్ లైన్ లావాదేవీలను గ్రాఫ్ తో ట్రాక్ చేశారు. ముఖ్యంగా భారత్- పాక్ మ్యాచ్ సమయంలో పాక్ బ్యాటింగ్, కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మ్యాచ్ అనంతరం ఇలా పలు దశల్లో ట్రాక్ చేశారు. ఇందులో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యూపీఐ లావాదేవీలు ఢమాల్ అంటూ పడిపోయాయి. మ్యాచ్ రసవత్తరంగా మారడం, కోట్లాది మంది టీవలకు అతుక్కపోవడమే అందుకు కారణం. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు లావాదేవీలు బాగానే జరిగినప్పటికీ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సమయంలో భారీగా పడిపోయాయి. అనంతరం మ్యాచ్ ముగియగానే మళ్లీ పుంజుకున్నట్లు గ్రాఫ్ చూపిస్తోంది.
#ViratKohli stopped #India shopping yesterday!!
UPI transactions from 9 a.m. yesterday till evening – as the match became interesting, online shopping stopped – and sharp rebound after the match! #HappyDiwali #indiavspak #ViratKohli𓃵 #Pakistan pic.twitter.com/5yTHLCLScM
— Mihir Vora (@theMihirV) October 24, 2022