శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత సారధి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ టూర్ లో గాయపడ్డ రోహిత్, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్ మ్యాన్, మొత్తంగా 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ధాటిగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధుశంక బౌలింగ్లో బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే.. ఈ మ్యాచ్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. అందుకు కారణం.. వారింట విషాదం నెలకొనడమే.
హాఫ్ సెంచరీ మార్క్ చేరుకోగానే.. రోహిత్ ఆకాశం వైపు చూస్తూ ‘మ్యాజిక్’ అన్నాడు. మ్యాజిక్.. అనేది అతని పెంపుడు కుక్క పేరు. ఈ అర్ధ శతకాన్ని రోహిత్ తమ పెంపుడు శునకానికి అంకితం చేశాడని నెటిజన్లు చెబుతున్నారు. తమ పెంపుడు శునకం మ్యాజిక్ నిన్న చనిపోయిందని రోహిత్ భార్య ‘రితిక’ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. తన పెద్ద బిడ్డను కోల్పోయినంత బాధగా ఉందంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఆమె చేసిన పోస్టుపై సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ప్రేయసి అతియా శెట్టి, ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు తిలక్ వర్మ మొదలైన వారు స్పందించారు.
మనం ఇళ్లలో పెంచుకునే కుక్కపిల్లలు కుటుంబ సభ్యుల్లాగే కలిసిపోతాయి. అయితే వాటి జీవితకాలం తక్కువ కావడంతో ఏదో ఒక తరుణంలో అవి మనల్ని విషాదంలో ముంచి వెళ్లిపోతాయి. రోహిత్ శర్మ జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. శ్రీలంకతో మ్యాచ్ ఆడేందుకు అతను సిద్ధం అవుతున్న సమయంలోనే ఈ విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో రోహిత్(83), శుభ్మన్ గిల్ (70)లు హాఫ్ సెంచరీలతో రాణించగా, మాజీ సారధి విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్) శతకంతో మెరిశాడు. ఫలితంగా టీమిండియా, శ్రీలంక ముంగిట 373 పరుగుల భారీ టార్గెట్ నిర్ధేశించింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 38 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి ఓటమి అంచున ఉంది. ఈ విషాదంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma’s This Celebration..!🥺❤️#RohitSharma | #INDvSL | @ImRo45
pic.twitter.com/rL2kKUIWsN— Tanay Vasu (@tanayvasu) January 10, 2023