2021 సంవత్సరానికి గాను ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఎంపికైంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారింగా ప్రకటించింది. గతేడాది స్మృతి మంధాన అద్భుతంగా రాణించింది. స్వదేశంలో జరిగిన సౌతాప్రికా సిరీస్ తో పాటు ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో కూడా మంధాన మెరుగైన ప్రదర్శన చేసింది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్ లలో కూడా రాణించింది. ఇక గతేడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో కూడా అద్భుతంగా ఆడింది.
2021 లో అన్ని ఫార్మాట్లలో కలిపి 22 మ్యాచ్లు ఆడిన టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన 38 సగటుతో 855 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ అవార్డు దక్కడం గమనార్హం.
ఐసీసీ ప్రకటించిన అవార్డుల జాబితా :
A year to remember 🤩
Smriti Mandhana’s quality at the top of the order was on full display in 2021 🏏
More on her exploits 👉 https://t.co/QI8Blxf0O5 pic.twitter.com/3jRjuzIxiT
— ICC (@ICC) January 24, 2022
బాబర్ ఆజమ్.. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ తో పాటు ఇటీవలే ప్రకటించిన ఐసీసీ వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్ గా కూడా ఎంపికైన విషయం తెలిసిందే. 2021 లో పాక్ జట్టు మెరుగైన ప్రదర్శన చేయడంలో ఆజమ్ తో పాటు మహ్మద్ రిజ్వాన్ లు కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరికీ అవార్డులు దక్కడం గమనార్హం.
ఇప్పటికే ఐసీసీ.. పురుషుల టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మహిళల వన్డే, టీ20 జట్లను కూడా ప్రకటించింది. పురుషుల వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్ గా బాబర్ ఆజమ్ ను ఎంచుకున్న ఐసీసీ.. టెస్టులకు మాత్రం కేన్ విలియమ్సన్ ను నియమించింది. టీ20, వన్డే జట్లలో చోటు దక్కని భారత ఆటగాళ్లకు టెస్టులలో మాత్రం స్థానం దక్కింది. రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ టెస్టు జట్టులో ఉన్నారు.