ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన సతీమణి జార్జినాకు అప్పుడే పుట్టిన కవలల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రొనాల్డో తన సోషల్ మీడియాలో అకౌంట్ ద్వారా తెలిపాడు. ‘అప్పుడే పుట్టిన మా బాబు చనిపోయిన విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏ తల్లిదండ్రులకైనా ఇది భరించలేని విషాదం. మరో పాప బతికి ఉన్న విషయం ఒక్కటే ఇప్పుడు మాకు కొంత ఆశ, ఆనందాన్ని ఇవ్వగలదు. ఈ సమయంలో మా వెన్నంటి ఉన్న డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోపత్యకు భంగం కల్పించవద్దని కోరుతున్నాం’అని రొనాల్డో భావోద్వేగపూరితమైన పోస్టు చేశాడు.
ఇప్పటికే జార్జినా- రొనాల్డో జంటకు నలుగురు పిల్లలున్నారు. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు, కవలలు పుట్టే అవకాశం ఉందని గత అక్టోబర్లో ఈ జంట వెల్లడించింది. ఈ ఫుట్బాల్ దిగ్గజం ఎంత బిజీగా ఉన్నప్పటకీ ఏ మాత్రం సమయం దొరికినా తన కుటుంబానికి కేటాయిస్తాడు. తన కుటుంబమే తనకు బలమని ఎప్పటికీ చెబుతుంటాడు. మరి ఈ విషాదం నుంచి రొనాల్డో త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Cristiano Ronaldo (@Cristiano) April 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.