ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వారికి ఎంత బందోబస్తు ఉంటుందో అందరికి తెలిసిందే. సీఎం కాన్వాయ్ వెళ్తుంటే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పోలీసుల భద్రతను సైతం దాటి సీఎం వాహన శ్రేణిపై దాడులు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఈఘటనలో 13మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
సీఎం నితీష్ కుమార్ సోమవారం గయా పట్టణంలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా నితీష్ హెలీకాప్టర్లో గయాకు వెళ్లారు. ఆయన అక్కడ స్థానికంగా తిరిగేందుకు సీఎం కాన్వాయ్ గయాకు బయలు దేరింది. అదే సమయంలో పట్నా-గయా హైవేపై కొందరు వ్యక్తులు నిరసనలు తెలుపుతున్నారు. వారు నిరసన తెలిపేందుకు ఓ బలమైన కారణం ఉంది. గౌరీచక్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. కొద్దిరోజుల క్రితం తప్పిపోయాడు. ఆ తర్వాత శవమై కనిపిచడంతో స్థానికంగా కలకలం మొదలైంది.
ఈ ఘటనపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్థానిక యువకులు పట్నా-గయా హైవేపై ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో నితీష్ కాన్వాయ్ అటుగా రావడంతో నిరసనకారులు అడ్డుకున్నారు. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన యువకులు కార్లపై రాళ్లు విసిరారు. దీంతో కాన్వాయ్లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా, వారి దాడి సందర్భంగా సీఎం కారులో లేకపోవడం, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Bihar | A total of 13 accused have been arrested in connection with stone-pelting at the convoy of Bihar CM Nitish Kumar yesterday: SSP Patna https://t.co/vPUyPwI32X
— ANI (@ANI) August 22, 2022
సీఎం కాన్వాయ్ పై జరిగిన దాడికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఉన్నత అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసన కారులను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు. సీఎం కాన్వాయ్ పై దాడికి సంబంధం ఉన్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి… ముఖ్యమంత్రి వాహన శ్రేణిపై దాడి జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#BreakingNews | #Bihar CM #NitishKumar‘s convoy attacked by an angry mob in Patna, 13 accused arrested. pic.twitter.com/74XgJsDFnT
— Mirror Now (@MirrorNow) August 22, 2022