ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని.. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెతున్నప్పటికీ.. కొన్ని దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వైఖరి.. అంబులెన్సు సదుపాయాలు లేక రోగులు నానా అవస్థ పడటం లాంటివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి హృదయ విదారకర ఘటనలు జరుగుతున్న సిబ్బందిలో మాత్రం మార్పులేదు. ఓ చిన్నారి మృతదేహాన్ని భుజాన వేసుకొని రోడ్డు పై వెళ్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కన్నీరు పెట్టిస్తుంది. ఈ దారుణ ఘటన మద్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
మద్యప్రదేశ్ ఛాతర్ పూర్ జిల్లాలో నాలుగు సంవత్సరాల ఓ చిన్నారి ప్రమాద వశాత్తు మరణించింది. పోస్ట్ మార్టం కోసం చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి వద్ద అంబులెన్స్ లు అందుబాటులో లేవు.. ప్రైవేట్ వాహనంలో తీసుకు వెళ్లేంత డబ్బు లేదు.. దీంతో పాప మేనమామ మృతదేహాన్ని తన భుజం పై వేసుకొని రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లి బస్టాండ్ కి చేరాడు. బస్సులో తన గ్రామానికి వెళ్లడానికి కూడా డబ్బులే లేకపోవడంతో ఓ వ్యక్తి సహాయం చేశాడు. గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది.
దేశం ఎంతో ప్రగతి సాధిస్తుందని చెబుతున్నా.. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. మారు మూల ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చేవారు కనీస సౌకర్యాలు లేక ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ కొన్ని ఆస్పత్రుల్లో ఇప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. చిన్నారి మృతదేహాన్ని భుజాన వేసుకొని వెళ్తున్న ఆ మేనమామ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A man carried the body of his four-year-old niece on his shoulders and took a bus to his village because he could not get a hearse from a hospital, This comes nearly four months after a four-year-old girl’s body was carried by her family on their shoulders. Both in Chhatarpur. pic.twitter.com/NXZUNODqUT
— Anurag Dwary (@Anurag_Dwary) October 20, 2022