విద్యాలయాలు అంటే పవిత్రమైన దేవాలయాలతో సమానం అంటారు. గురు బ్రహ్మా.. గురుః విష్ణు, గురు దేవో మహేశ్వర.. అంటూ త్రిమూర్తులతో పోల్చుతాం. అలాంటిది ఈ మద్య కాలంలో ఉపాధ్యాయులు చేస్తున్న పనికిమాలిన పనులతో విద్యా వ్యవస్థ ఎటు పోతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా ఓ కళాశాల ప్రిన్సిపాల్ ని దారుణంగా కొట్టాడు. కొట్టింది ఎవరో బయట వ్యక్తి కాదు ఆ కాలేజీలో ప్రొఫెసర్.
ఇది చదవండి : బీజేపీలోకి ములాయం సింగ్ కోడలు.. ఎవరీ అపర్ణ యాదవ్!
ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ప్రొఫేసర్ ప్రిన్స్ పాల్ పై చేయి చేసుకోవడమే కాదు.. బండ బూతులు కూడా తిట్టినట్టు సమాచారం. దాంతో ప్రొఫెసర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా కళాశాలలో వ్యాక్సినేషన్ విషయం గురించి మాట్లాడదామని తాను ప్రొఫెసర్ ని తన గదికి పిలిచానని.. కానీ ఆ విషయం పక్కన పెట్టి తనపై దాడి చేశాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడని ప్రిన్సిపల్ తెలిపారు. ప్రిన్సిపాల్ గదిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
మొదట ప్రిన్స్ పాల్ గదికి వచ్చిన ప్రొఫెసర్ కూర్చున్నాడు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం పెద్దదిగా మారింది. తర్వాత ప్రొఫెసర్ లేచి ప్రిన్స్ పాల్ పై దాడి చేయడమే కాదు.. టేబుల్ మీద ఉన్న వస్తువులన్నింటినీ తీసుకొని.. అతనిపై విసిరేయడం మొదలుపెట్టాడు. గొడవ మొత్తం బయటకు వినపడటంతో కొంతమంది లోపలికి వచ్చి గొడవను అదుపు చేశారు. తర్వాత ప్రిన్స్ పాల్ అతడిని వెళ్లిపొమ్మని సైగలు చేసినా.. వినిపించుకోకుండా కుర్చిపై దర్జాగా కూర్చున్నాడు. ఈ మేరకు ప్రొఫెసర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
An assistant professor was booked for allegedly beating up principal of a Government College in Ujjain @ndtv @ndtvindia pic.twitter.com/egom5OIVjA
— Anurag Dwary (@Anurag_Dwary) January 19, 2022