ప్రపంచ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ . ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా పేరుగాంచిన ముకేష్ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కుమారుడు ఆకాశ్కు, కుమార్తెకు ఈషాకు పెళ్లి చేసిన సంగతి సంగతి విదితమే. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట్లో మరోసారి చిరునవ్వులు వెల్లువిరిశాయి
ప్రపంచ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా.. 7,18,000 కోట్ల నికర విలువతో ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా పేరుగాంచారు. వీరికి ముగ్గురు పిల్లలున్న సంగతి విదితమే. పెద్ద కుమారుడు ఆకాశ్కు, కుమార్తెకు ఈషాకు పెళ్లి చేశారు. అలాగే అనంత్ కు కూడా ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థం నిర్వహించారు. తొలుత ముకేష్ అంబానీ కుమార్తె ఈషా, పిరామిల్ సంస్థ అధినేత కుమారుడు ఆనంద్ పిరామిల్ తో 2018లో పెళ్లి జరగ్గా.. అందరూ చర్చించుకునేలా వేడుక చేశారు. వీరికి కవలలు జన్మించారు. ఆకాశ్, శ్లోకాలకు 2019లో వివాహం జరిగింది. వారికి 2020లో మొదటి సంతానంగా బాబు పుట్టిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట్లో మరోసారి చిరునవ్వులు వెల్లువిరిశాయి. ముఖేష్ అంబానీ మరోసారి తాత అయ్యారు.
ఆకాశ్, శ్లోకా దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. మఖేష్ అంబానీ కోడలు శ్లోకా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి ఈ జంటకు పాప జన్మించింది. దీంతో వారి అంబానీ ఇంట్లో తొలిసారిగా ఆడపిల్ల పుట్టినట్లయింది. అకాశ్ దంపతులకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని అంబానీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ పరిమల్ నథ్వానీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ విషయం తెలిసి పలువురు ఈ జంట అభినందనలు తెలుపుతున్నారు. ఏప్రిల్లో ముంబయిలోని ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో బేబీ బంప్తో శ్లోకా కనిపించారు. ఆ సమయంలో ఆమె రెండో బిడ్డకు జన్మనిస్తున్నట్టు ప్రకటించారు. అంబానీ కుటుంబం ఆధ్వరంలో నడుస్తోన్న పాఠశాలలో ఆకాశ్, శ్లోకాలు చదువుకున్నారు. అప్పటి నుండే ఒకరినొకరు ఇష్టపడటంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. శ్లోకా తండ్రి ప్రముఖ వజ్రాల వ్యాపారి రుస్సెల్ మెహతా. ఆకాష్ జియో చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
Heartiest congratulations to Akash and Shloka Ambani on the joyous arrival of their little princess! May this precious blessing bring immense happiness and love to your lives. pic.twitter.com/MXHdohoxqi
— Dhanraj Nathwani (@DhanrajNathwani) May 31, 2023