ఓ ప్రజాప్రతినిధిపై బహిరంగంగా దాడి జరిగింది. కొందరు వ్యక్తులు ఎమ్మెల్యేపై చెప్పులతో దాడి చేశారు. ఆ ఎమ్మెల్యే బతుకుజీవుడా అని అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. దాడికి గురైన ఎమ్మెల్యే అక్కడి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. అంతేకాకుండా దాడి చేసింది సొంతపార్టీ కార్యకర్తలు, నాయకులే అంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీపార్టీ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారు అనడానకి ఇదే పెద్ద ఉదాహరణ అంటూ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు దాడికి గురైన ఎమ్మెల్యే ఇదంతా బీజేపీ కుట్ర అంటూ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆప్ కి చెందిన గులాబ్ సింగ్ యాదవ్ సోమవారం సాయంత్రం 8 గంటల సమయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల విషయంలో చిన్నపాటి గొడవ జరిగినట్లు కనిపించింది. ఆ సమయంలో ఎమ్మెల్యేకి కార్యకర్తలు, నాయకులకు మధ్య మాటలయుద్ధం జరిగింది. కోపంతో ఊగిపోయిన కార్యకర్తలు ఎమ్మెల్యేపై దాడికి దిగారు. కాలర్ పట్టుకుని పిడి గుద్దులు గుద్దారు. కొందరు అయితే చెప్పులు తీసుకుని ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఎమ్మెల్యే పక్కన ఉన్న కొందరు ఆపేందుకు ప్రయత్నించినా కూడా వారిని అడ్డుకోలేకపోయారు. వెంటనే గులాబ్ సింగ్ యాదవ్ అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేస్తూ ఆప్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టికెట్లు అమ్ముకుంటోంది అనడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే బీజేపీ ప్రచారాలను ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఖండించారు. ‘నేను ప్రస్తుతం పోలీసు స్టేషన్ లో ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చేసరికి బీజేపీ కార్పొరేటర్, బీజేపీ కాండేట్లు అక్కడ ఉన్నారు. ఎందుకంటే నాపై దాడి చేసిన వారి కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి. వాళ్లు నాపై చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవం. నేను టికెట్లు అమ్ముకుంటున్నాను అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు.
Unprecedented scenes from the party that indulged in the theatrical drama of ‘honest politics’.
Such is AAP’s corruption that even their members are not sparing their MLAs!
A similar outcome awaits them in upcoming MCD polls. pic.twitter.com/ig9rKuKl82
— Sambit Patra (@sambitswaraj) November 21, 2022