అమెరికాలోని న్యూయార్క్లోని ట్రాయ్ ప్రాంతంలో ప్రముఖ పరిశోధనా ల్యాబ్ ఫ్రీజర్లో ‘కిరణజన్య సంయోగక్రియ’ ప్రక్రియకు సంబంధించిన సాంపుల్స్, ఇతర ఎలిమెంట్స్ను ఫ్రీజర్లో భద్రపరిచారు. ఫ్రీజర్ నుండి ‘బీప్’ అనే శబ్దం రావడంతో ల్యాబ్లోని క్లీనర్ ఫ్రీజర్ను ఆఫ్ చేశాడు. పాతికేళ్లుగా చేసిన సైంటిస్టుల కష్టం, వారి శ్రమ వృథా అయింది. దీనితోపాటుగా కోట్లలో నష్టం వాటిల్లింది
రిసెర్చ్ ల్యాబ్లలో చాలా రకాల పరిశోధనలు జరుగుతాయి. అయితే ఫలితాల కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో డేట్, టైం సరిగ్గా అంచనా వేసి చూడాలి. లేదంటే పరిశోధనలు తారుమారు అవుతాయి. ఇటువంటి పరిశోధనలు కొన్ని సంవత్సరాలపాటుగా కొనసాగుతాయి. వాటిని నిర్వహించడానికి సైంటిస్టులు చాలా శ్రమ పడవలసి వస్తుంది. కొన్ని పరిశోధనలు సక్సెస్ అవుతాయి. కొన్ని ఫెయిల్ అవుతాయి. పరిశోధనా సంస్థల్లో సిబ్బంది మధ్య సమన్వయంతోనే సక్సెస్ సాధించగలుగుతారు. ఏ పరిశోధనలు చేసినా వాటి నమూనాలను ల్యాబోరేటరీల్లో భద్రపరుస్తారు. నమూనాలు పాడవకుండా మైనస్ డిగ్రీల వద్ద ఫ్రీజర్ను సెట్ చేస్తారు. అయితే పాతికేళ్ల నుంచి పరిశోధనలు చేసి ఓ ల్యాబొరేటరీ.. నమూనాలను ఫ్రీజర్లో భద్రపరిచింది. అవి దెబ్బతినకుండా ఉండడానికి మైనస్ 110 కిపైగా డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద ఫ్రీజర్ను పెట్టారు. ఫ్రీజర్ నుండి ‘బీప్’ అనే సౌండ్ రావడంతో.. విసిగిపోయిన క్లీనర్ ఫ్రీజర్ ను కట్టేశాడు. ఆ తర్వాత ఏమైంది.. అది ఎక్కడ జరిగింది అన్న వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని న్యూయార్క్లోని ట్రాయ్ ప్రాంతంలో ప్రముఖ పరిశోధనా ల్యాబ్ ఉంది. దానిపేరు రెన్సీలేర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ రిసెర్చ్ ల్యాబ్. ఇందులో నిరంతరం పలు రీసెర్చ్లు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ల్యాబ్ ఫ్రీజర్లో ‘కిరణజన్య సంయోగక్రియ’ ప్రక్రియకు సంబంధించిన సాంపుల్స్, ఇతర ఎలిమెంట్స్ను ఫ్రీజర్లో భద్రపరిచారు. ఫ్రీజర్ను మైనస్ 112 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేశారు. అయితే ప్రతిరోజు ఫ్రీజర్ నుండి ‘బీప్’ అనే శబ్దం రావడంతో ల్యాబ్లోని క్లీనర్ సౌండ్కు చికాకు పడి ఫ్రీజర్ను ఆఫ్ చేశాడు. దీంతో ఫ్రిజ్ లోపలున్న చల్లదనం తగ్గిపోయింది. అందులో నిల్వ ఉంచిన సాంపుల్స్ పనికి రాకుండాపోయాయి. దీంతో పాతికేళ్లుగా చేసిన సైంటిస్టుల కష్టం, వారి శ్రమ వృథా అయింది. దీనితోపాటుగా కోట్లలో నష్టం వాటిల్లింది.
ఫ్రిజ్ డోర్పై అలారంను ఎలా సైలెంట్ మోడ్ లో పెట్టాలో సూచనలు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అతడి కారణంగా 25 సంవత్సరాలనుంచి చేస్తున్న అనేక పరిశోధనల సాంపుల్స్, పాడయిపోయాయని.. పరిశోధన పునరావృతం చేయడానికి మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సంస్థ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటన సెప్టెంబరు 2020లో చోటుచేసుకుంది. ఆ క్లీనర్ ను నియమించిన క్లీనింగ్ సర్వీస్పై పరిశోధనా సంస్థ కేసు వేసింది. ‘హెచ్చరికలు ఉన్నప్పటికీ.. కొంతమంది అనుచిత ప్రవర్తన, నిర్లక్ష్యం వల్ల మూల్యం చెల్లించుకున్నారని.. ఫలితంగా దురదృష్టవశాత్తు 25 సంవత్సరాల శ్రమ వృథా అయిందని.. వారికి కనీసం 10 లక్షల డాలర్లు(రూ.8 కోట్లు) నష్టం వాటిల్లింద’ని పరిశోధనా సంస్థ తరపు లాయర్ తెలిపారు.