ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ఒక్కసారిగా కలకలం రేగింది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పేలుడు పదార్థాలు లభ్యమవ్వడం సంచలనంగా మారింది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పెన్ ఘాట్ వంతెన కింద భద్రతా బలగాలు జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పోలీసులు, ఆలయ అధికారులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు.
ఇప్పటికే ఎక్కడ నుంచి వచ్చాయనే అంశంపై భద్రతా అధికారులు విచారణ మొదలు పెట్టారు. మొత్తంగాఆరు జిలెటిన్ స్టిక్స్ లను స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ స్వ్యాడ్ చుట్టుపక్కల పరిసరాలు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు అదనపు బలగాల సాయంతో అయ్యప్ప ఆలయ మార్గంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మకరజ్యోతి దర్శనానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చిన విషయం తెలిసిందే. మకర జ్యోతి దర్శనం అనంతరం ఇవాళ్టి నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.