కరోనా మూడో వేవ్ కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ చర్చ మళ్లీ మొదలైంది. ఇప్పటికే రిలీజ్ డేట్స్ ప్రకటించి వాయిదా వేసుకున్న నిర్మాతలు.. తదుపరి రిలీజ్ డేట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అయితే బిగ్ మూవీస్ వచ్చే పరిస్థితి లేని సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా నుండి క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.
ఇప్పటికే పలుమార్లు ఆచార్య సినిమా రిలీజ్ డేట్లు వాయిదా వేసిన మేకర్స్.. ఈ మధ్యే ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ పరిస్థితి చూస్తుంటే అదికూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అందుకే మేకర్స్ మరోసారి ఆచార్య విడుదల తేదీ విషయంలో కీలక మార్పులు చేశారు. ఆచార్య సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ వదిలారు మేకర్స్.
ఈ వార్త తెలిసి మెగాఫ్యాన్స్ ఖుషీ అయినప్పటికీ, అటు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మాత్రం కంగారు పడుతున్నారు. ఎందుకంటే.. మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా రిలీజ్ డేట్ కూడా ఏప్రిల్ 1నే కావడం కారణం. సంక్రాంతికి రావాల్సిన సర్కారు వారి పాట.. వాయిదాపడి ఏప్రిల్ 1 డేట్ ప్రకటించింది. ఇప్పుడు అదే రోజున మెగాస్టార్ ఆచార్య సినిమా రాబోతుండటంతో సర్కారు టీమ్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందేమో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
This Ugadi, Witness the MEGA MASS on big screens 💥💥#Acharya Grand Release on April 1 🔥#AcharyaOnApril1
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/DwnYRcakcd
— Konidela Pro Company (@KonidelaPro) January 16, 2022
ఒకవేళ మహేష్ సినిమా అన్నివిధాలా ఏప్రిల్ 1కి సిద్దమైతే మాత్రం మెగాస్టార్ ఆచార్యతో పోటీ తప్పదు. కాబట్టి దీనికి సంబంధించి ఇరువురు స్టార్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. వస్తే మాత్రం.. సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వార్ ఓ రేంజిలో ఉంటుందని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి సర్కారు టీమ్.. ప్రస్తుతం షూటింగ్ ఆపేసి ఇళ్ళకే పరిమితమైంది. త్వరలో సర్కారు టీమ్ అధికారిక ప్రకటన ఇవ్వనుందని టాక్ నడుస్తుంది. మరి మెగాస్టార్ v/s సూపర్ స్టార్ వార్ అవుతుందా లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.